ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి (Mla Manchireddy Kishan Reddy) అన్నారు. శనివారం మంచాల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రం ఏర్పాటు తరువాత గడిచిన 10 ఏండ్లలో బీఆర్ఎస్ (BRS ) పాలనలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చురుకుగా కొనసాగాయని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సంక్షేమ (Welfare Schemes) పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకుందని వెల్లడించారు. ముఖ్యంగా గ్రామాల (Villages) అభివృద్ధికి మౌలిక సదుపాయాల కోసం పల్లెప్రగతి ఎంతగానో దోహదపడిందన్నారు.
రోడ్లు (Roads) , డ్రైనేజీలు, వీధి దీపాల కోసం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ నర్మద, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, సర్పంచులు పెరిక వినోద, జగన్రెడ్డి, నహీదాబేగం, కొంగర విష్ణువర్ధన్రెడ్డి, రాజు నాయక్, శ్రీనివాస్రెడ్డి, నాగరాజు గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.