దుబాయ్: టీ20 ప్రపంచకప్లో ఆసక్తికపోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కోసం కోట్లాది మంది భారతీయులు కండ్లు అప్పగించి చూస్తున్నారు. కివీస్పై అఫ్గన్ విజయం సాధిస్తే.. టీమ్ఇండియాకు సెమీఫైనల్ బెర్తు ఖరారయ్యే అవకాశముంది. దీంతో అఫ్గన్ జట్టు ఎలాగైనా గెలువాలని ప్రతీ భారత అభిమాని మనసారా కోరుకుంటున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింట ఓడి, రెండు మ్యాచ్ల్లో గెలిచిన కోహ్లీసేన ప్రస్తుతం నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంటే.. మూడు విజయాలతో కివీస్ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సోషల్మీడియాలో పలువురు అభిమానులు ఆసక్తికర పోస్ట్లు పెడుతున్నారు. ‘అరె బాబు మనసులో ఏం పెట్టుకోకండిరా..న్యూజిలాండ్పై ఎలాగైనా గెలువండిరా’ అని రవితేజ సినిమా డైలాగ్తో మీమ్స్ తయారు చేశారు. మరోవైపు స్టార్ స్పిన్నర్ రషీద్ఖాన్ను కెప్టెన్ కోహ్లీ, రోహిత్శర్మ, మెంటార్ ధోనీ దువ్వుతున్న ఫొటో నవ్వులు పూయిస్తున్నది.