న్యూఢిల్లీ : ఢిల్లీ సర్వీసెస్ బిల్లును (Delhi services bill) కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పాటు, కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ఈనెల 7, 8 తేదీల్లో సభకు విధిగా హాజరు కావాలని ఆప్ తమ సభ్యులకు మూడు వాక్యాలతో కూడిన విప్ జారీ చేసింది.
ఢిల్లీ అధికారులపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కల్పించేలా ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. పాలనా యంత్రాంగంపై ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తున్న ఈ బిల్లును మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న ఆప్ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మద్దతు కూడగడుతోంది. ఆగస్ట్ 7, 8 తేదీల్లో సభకు విధిగా హాజరవ్వాలని, దీన్ని అత్యంత కీలకంగా తీసుకోవాని విప్లో ఆప్ స్పష్టం చేసింది.
ఈ బిల్లు విషయంలో ఆప్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ కూడా తమ రాజ్యసభ ఎంపీలను సోమవారం సభకు విధిగా హాజరు కావాలని కోరుతూ విప్ జారీ చేసింది. కాగా ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై దాదాదపు ఐదు గంటల చర్చ అనంతరం గురువారం లోక్సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
Read More :