న్యూఢిల్లీ : గత రెండు నెలల్లో 5 లక్షలకు పైగా వ్యక్తులను రూ .150 కోట్లకు మోసం చేసిన కేసులో 11 మందిని ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ బుధవారం అరెస్టు చేసింది. వీరు పవర్ బ్యాంక్, సన్ఫ్యాక్టరీ, ఎజ్ప్లాన్ వంటి యాప్లను ఉపయోగించి మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నకిలీ యాప్లతో మోసపోకుండా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్లో పవర్ బ్యాంక్ యాప్, ఎజ్ప్లాన్ యాప్ www.ezplan.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్లపై పెట్టుబడిపై రెట్టింపు లాభదాయకమైన రాబడిని ఇస్తున్నట్లు ప్రకటించారు. కొందరి నుంచి పెట్టుబడి పెట్టించుకుని గంట, రోజువారీగా రాబడిని కూడా ఇచ్చాయి. వీరిని చూసి మరింత మంది నుంచి పెట్టుబడులను ఆకర్శించారు. రూ.300 నుంచి అనేక లక్షల రూపాయల వరకు పెట్టుబడులు తీసుకున్నారు. ఈ యాప్ యజమానులైన చైనా పౌరులు భారతదేశంలోని బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలకు సహాయం చేయడానికి నిందితులను సంప్రదించారు. నిందితులతో కలిసి యాప్ యజమానులు దాదాపు 5 లక్షల మంది నుంచి రూ.150 వరకు సేకరించి మోసం చేసినట్లు డీసీపీ (స్పెషల్ సెల్-సైబర్) అన్యేష్ రాయ్ తెలిపారు. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ అన్వేష్ రాయ్ పేర్కొన్నారు.
“పవర్ బ్యాంక్, ఈజడ్ ప్లాన్ అనే రెండు యాప్లపై సోషల్ మీడియాలో వందలాది ఫిర్యాదులు వచ్చాయి. కొందరు ఫిర్యాదుదారులు తాము లక్షల రూపాయలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. పవర్ బ్యాంక్ యాప్ వేలాది డౌన్లోడ్లతో యాప్ స్టోర్లో ట్రెండింగ్లో ఉంది” అని రాయ్ చెప్పారు. మోసగాళ్లు దేశవ్యాప్తంగా వివిధ రీతుల్లో మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగాల్, ఢిల్లీ, బెంగళూరు పోలీసుల సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి బెంగళూరు నుంచి పనిచేస్తున్న టిబెటన్ మహిళను ఐజీఐఏ విమానాశ్రయంలో పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మమత డిమాండ్ : కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాల్సిందే..!
కొత్త రికార్డ్ : పది మందికి జన్మనిచ్చిన సౌతాఫ్రికా మహిళ
ఓపెన్ లెటర్ : స్కాలర్షిప్ కోసం బిర్సా కుటుంబీకుల వినతి
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
మంచి డిక్రీ : వ్యాక్సిన్ వేసుకోని వారికి గ్రామ బహిష్కరణ
సమష్ఠి విజయం : తొలి మాస్క్ రహిత దేశంగా ఇజ్రాయెల్
చరిత్రలో ఈరోజు.. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సా ముండా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..