కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోదాడ నియో జకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగారాజు అద్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం హుజూర్నగర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసినారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కృష్ణబాబు, పట్టణ అధ్యక్షుడు కందుల శ్రీను, గంధం పాండు, సిద్దల రాంబాబు, పంది ఏసు, కుడుముల వినయ్, పంది శ్రీను, కార్ల పిచ్చయ్య, వేణు, వీరబాబు, సతీశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.