తెలంగాణ గడ్డ ఉత్పత్తి చేసిన చాలామంది విద్యార్థులు, యువకులు, మేధావులు ఉద్యమ కాలంలో సమరశీల పాత్రను పోషించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్ఫూర్తిగా జన బాహుళ్యాలను కదిలించే ప్రయత్నంలో భాగంగా భువనగిరి, సూర్యాపేట, వరంగల్ డిక్లరేషన్ విజయవంతమయ్యాయి. నాటి పాలక పార్టీ తెలంగాణ వాదులను అన్నలుగా ముద్రవేసి దాడులు చేసింది. ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఎందరివో జీవిత ఆశయాలను నాశనం చేసింది. అయినా తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో పదవులు అనుభవించి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.
నాటి తెలంగాణ ఉద్యమంలో భూపతి కృష్ణమూర్తి, జనార్దన్రావు, సీతారామారావు, పాపిరెడ్డి, వెంకట నారాయణ, వామపక్ష భావజాలం గల విద్యార్థులు సంగని మల్లేశ్వర్ (నేను), వీరన్న, సుదర్శన్, బ్రహ్మం తదితరులు ముందున్నారు. తెలంగాణకు జరుగుతు న్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ చావో రేవో అన్న రీతిలో ముందుకు సాగారు. అయితే ప్రభు త్వం తెలంగాణ ఉద్యమం వెనుక మావోయిస్టు పార్టీ ఉందన్న కారణంతో అణచివేయజూసింది. ఆ సమయంలో పోలీసులు అర్థ్దరాత్రి నన్ను ఎత్తుకెల్లితే నీతిమాలిన ‘పాపి’ తెలంగాణ జెండా కింద పడేసి ‘తెలంగాణ వద్దు..గీ ఉద్యమం వద్దు’ అంటూ పారిపోయాడు. 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపందుకున్నది.
కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొని సాధించుకున్న తెలంగాణలో కొందరు ప్రథమ ప్రాధాన్యంలో పదవులు పొందారు. రాష్ట్రంలో ఎందరో అకడమిక్ పరంగా, అపార అనుభవజ్ఞులు, నిష్ణాతులు ఉన్నప్పటికీ, ఉన్నత విద్యా మండలి తొట్ట తొలి చైర్మన్గా ప్రొఫెసర్ పాపిరెడ్డికి అవకాశం ఇచ్చారు. రెండుసార్లు పదవిని అనుభవించి, మూడవ టర్మ్ కొనసాగుతుండగా కోర్టు జోక్యంతో పదవిని కోల్పోయిన పాపిరెడ్డి ఇప్పుడు చౌకబారు విమర్శలకు పాల్పడటం తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టున్నది.
తొలివరసలోనే పదవులు పొంది, తాము పొందిన మేలును మర్చిపోయి, మాకేం వచ్చిందని విమర్శలకు పాల్పడటం వారి అనైతికతను తెలియజేస్తున్నది. ఇప్పుడు ప్రతిపక్షాల పంచన చేరి ప్రభుత్వం పైనే విమర్శలకు తెగబడటం ఆయన బరితెగింపునకు నిదర్శనం. ఇలాంటి వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిన ఎంతైనా అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఉన్నత విద్య తోడ్పాటులో ఆయన చేసిన నిర్వాకం జగమెరిగిన సత్యమే. అసలు పని మీద శ్రద్ధ లేకుండా, కొసరు పని మీదనే ఆసక్తి చూపించి పక్కదారి పట్టాడని మొదటి నుంచి విమర్శలున్నాయి. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. ఆ సమయంలో సబ్బండ వర్గాలను కలుపుకొని ఐక్యంచేసే, రాజకీయ పార్టీలతో సం బంధం లేని వ్యక్తులు ఉండాలని అనుకున్నాం. అలా కేసీఆర్ సూచన మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్గా ఆచార్య ఎం.కోదండరాంను నియమించుకున్నాం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో, కాకతీయ యూనివర్సిటీ ఉన్నందున ఇక్కడకూడా విద్యావంతుడు కన్వీనర్గా బీసీలను కాదని, విరుద్ధంగా తుమ్మల ‘పాపి’ రెడ్డి అయినందునే కోదండరాం నియమించారు. ఓరుగల్లు జిల్లాలో ఉద్యమంలో కదం తొక్కని యువకుడు లేడు, గళం వినిపించని కవులు, కళాకారులు, ఉద్యోగులు, మేధావులు లేరు. పాపిరెడ్డి జేఏసీ చైర్మన్గా వ్యవహరించిన సమయంలో జేబులో చేతులు పెట్టుకొని తిరుగుతూ, ఎవరు కారు తెస్తారోనని చూడడం తప్ప పది రూపాయలు ఖర్చుపెట్టిన పాపాన పోలేదు. నాడు నీవు చేసిన శల్య సారథ్యం ఉద్యమంలో అరెస్టులు. పోలీసుల లాఠీ దెబ్బలు, రబ్బర్ బుల్లెట్లు ఎదుర్కొన్న మాలాంటి ఉద్యమకారులందరికీ తెలిసిందే. ఏండ్ల పాటు ఆ పదవులను అనుభవించిన ‘పాపి’ అసమ్మతి రాగం ఎత్తుకోవడం అత్యంత హేయంగా ఉన్నది.
నీ చరిత్ర తెలుసుకోకుండా ఉద్యమంలో పాలు పంచుకున్నావన్న ఏకైక కారణంతో ఉన్నత విద్యా మండలికి చైర్మన్గా చేసి మొట్టమొదటగా గౌరవించింది నిన్నే కదా? ఎప్పుడైనా నీకు ఆ అర్హత ఉన్నదని భావించావా? ‘వంగాబార్’ సభ్యుడివని నిన్ను కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారిగా నియమిస్తే నీ సొంత ఆస్తుల్లా వర్సిటీని ఖాళీ చేశావు.
వరంగల్లో ప్రింటింగ్కు అవకాశమున్నా గుంటూరులో ప్రింటింగ్ చేపించి లక్షలు గడించింది ఎవరు? పరీక్షల విభాగంలోని స్క్రాప్ యూనివర్సిటీ అనుమతి లేకుండా లారీలకు.. లారీలు అమ్ముకున్నది ఎవరు? నీ అక్రమాలపై ఒక పత్రికలో వచ్చిన బ్యానర్ ‘పాపి’ కథనం మర్చిపోయావా? నీవు నీతిపరుడివా? అయినా నిన్ను భరించినం కదా? ఎకనమిక్స్ విభాగంలో నీకంటే తురుంలు ఉన్నారు.
దేశంలో పేరొందిన ఆచార్యులు ఉన్నారు. ఉద్యమ సమయంలో పోలీసులు అడుగు పెడితే వీసీగా రాజీనామా చేస్తానని త్యాగానికి సిద్ధపడ్డ నీతిమంతులు ఉన్నారు. యాదాద్రి జిల్లా కొండాపూర్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉపేందర్ రెడ్డి భూమిని కబ్జా చేసి బెదిరించిన సంఘటన నిజం కాదా? అర్హత లేకున్నా ఏడేండ్లు కుర్చీలో కూర్చొని చేసిన నీతిలేని పనులతో నిన్ను సమా జం ఈసడించుకుంటున్నది.
తెలంగాణ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలోనే అత్యున్నతమైన పదవిని అనుభవించి. ‘కూట్లె రాయి తీయనోడు ఏట్లో రాయి తీత్తడా’ అన్నట్టు ఈయన గారికి ఎమ్మెల్సీ కావాల్సి వచ్చిందట? తనకు పదవుల యావ తప్ప, ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశమే ఆయనకు లేదు. అందుకే తనలోని అహంకార కోణాన్ని మరోసారి ప్రస్ఫుటం చేస్తూ, తెలంగాణ అభివృద్ధి వ్యతిరేక శక్తులతో, కులం పేరుతో అధికారంలోకి రావాలనుకుంటున్న శక్తులతో కలవడం ఆయన నిబద్ధతలోని డొల్లతనాన్ని బయట పెడుతున్నది. అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టే విధంగా ప్రతిపక్షాల సమావేశాల్లో పాల్గొనడం, నిందలు వేయడం దివాలకోరు తనాన్ని, ఆయన చౌకబారు ఆలోచనా సరళిని తెలియజేస్తున్నది.
దార్శనికుడు కేసీఆర్ నాయకత్వాన్ని మరింత పరిపుష్ఠం చేయాల్సింది పోయి, అన్నీ అనుభవించిన తర్వాత ఇప్పుడు విమర్శలకు పాల్పడటంలో మర్మం ఏంటని ప్రజలు, ఉద్యమకారులు అడుగుతున్న ప్రశ్నలకు పాపిరెడ్డి తక్షణమే జవాబు చెప్పాలి. ఆయన వెంటనే క్షమాపణలు కూడా చెప్పాలి. తెలంగాణ నిర్మాణంలో తాను చేసిన ఒక్క కాంట్రిబ్యూషన్ అయినా చెప్పగలడా అన్నదే ఉద్యమకారుల సూటి ప్రశ్న. ‘పాపి’ నాయకుడు కావాలన్న అత్యాశతో శ్రేష్టపాలనను ఓర్వలేక అనైతికంగా దిగజారి మాట్లాడుతున్నావు.
కేసీఆర్ దయతో తెలంగాణ పునర్నిర్మాణ సాధనలో అవకాశం పొందిన ‘పాపి’ కేవలం తన స్వార్థ ప్రయోజనాలను చూసుకుని వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సింది పోయి దాన్ని నామమాత్రపు వ్యవస్థగా మార్చిన ఘనత పాపిరెడ్డికి చెందుతుందనేది వాస్తవం. నీకు ఆనాడే తప్పులు కనిపిస్తే ఉద్యమ నేత, జనహృదయ ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో వచ్చిన పదవిని ఎందుకు వదిలేయలేదని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యమానికి చేసింది పిసరంత అయినా, కొండంత పదవిని, లాభాన్ని పొందిన విషయం మర్చిపోయి కృతజ్ఞత అన్నమాటనే మర్చిపోయావు. ఈరోజు కులతత్వంతో విమర్శలకు దిగుతున్న పాపిరెడ్డి నిజమైన ఉద్యమ ద్రోహిగా నిలిచాడు. కుల దురహంకారంతో ఎన్ని చేసినా… తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. అలాంటి తెలంగాణ ప్రజల దృష్టిలో నీవు నేలబారు మేథావిగా నిలపడటం తప్పితే సాధించేది ఏమీ లేదు. ఇలాంటి వారి నియ్యతి, అసలు స్వరూపం పదవి లేనప్పుడే తెలుస్తుంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్న ‘పాపి’ అక్రమాలపై విజిలెన్స్తో విచారణ చేయించాలి.
(వ్యాసకర్త: జర్నలిజంశాఖ విభాగాధిపతి, కేయూ)
దేశంలో పేరొందిన ఆచార్యులు ఉన్నారు. ఉద్యమ సమయంలో పోలీసులు అడుగు పెడితే వీసీగా రాజీనామా చేస్తానని త్యాగానికి సిద్ధపడ్డ నీతిమంతులు ఉన్నారు. యాదాద్రి జిల్లా కొండాపూర్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉపేందర్ రెడ్డి భూమిని కబ్జా చేసి బెదిరించిన సంఘటన నిజం కాదా? అర్హత లేకున్నా ఏడేండ్లు కుర్చీలో కూర్చొని చేసిన నీతి లేని పనులతో నిన్ను సమాజం ఈసడించుకుంటున్నది.