అమరావతి : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Secretary Narayana) ఈసారి ఏపీ(AP) సీఎం వైఎస్ జగన్ (CM Jagan) పై సెటైర్లు వేశారు. ఇటీవల విజయవాడ సభలో జగన్పై గులకరాయితో జరిగిన దాడి ఘటనపై ఆయన తనదైన శైలీలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో బాంబు దాడుల సంస్కృతి నుంచి గులక రాయికి రావడం మంచిదేనని వ్యాఖ్యానించారు. గులకరాయి దాడి అంటూ రాజకీయాన్ని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు.
గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కాళ్లకు కట్టు కట్టుకుని తిరిగింది. ఏపీలో ప్రస్తుతం వైఎస్ జగన్ కళ్లకు కట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు గులకరాయి కథలు అంతా తెలుసని విమర్శించారు. జగన్పై రాయి వేసిన వారిని కాకుండా మరొకరిని ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం మరణవార్త అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తప్పులు చేస్తున్న అధికారులు జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు. ఈ కేసులో ఏ-1ను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.