హైదరాబాద్ : కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం చేశారు.
నిజాంపేట రోడ్డులో మార్చి 27వ తేదీ రాత్రి కేపీహెచ్బీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న సృజన్ అనే వ్యక్తి కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టాడు. దీంతో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి ఘటనాస్థలికి వెళ్లి విచారిస్తున్న క్రమంలో మరో వ్యక్తి మద్యం మత్తులో కారును పోలీసులపైకి పోనిచ్చాడు. ఈ క్రమంలో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. తక్షణమే ఏఎస్ఐని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు.
ఇవి కూడా చదవండి..