వరంగల్ : హన్మకొండ బస్ డిపోలో కరోనా కలకలం రేపింది. వరంగల్ లోకల్ బస్సులో కండక్టర్గా పని చేస్తున్న ఓ మహిళా కండక్టర్కి కరోనా సోకింది.15 రోజుల పాటు సిక్ లీవ్లో ఉండి సదరు మహిళా కండక్టర్ రెండు రోజుల క్రితం డ్యూటీలో జాయిన్ అయినట్లు సమాచారం.
శనివారం నుంచి దగ్గు వస్తుండటంతో అధికారులు కరోనా టెస్ట్ చేయించారు. పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనలో పడ్డారు. డ్యూటీ ఆఫీసర్కు కూడా కారోనా లక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.