హైదరాబాద్: జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతన్నది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 72 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి 70,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి శ్రీశైలానికి వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు 1,25,659 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 19,070 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 880 అడుగుల వద్ద నీరు ఉన్నది. ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.