Congress List | లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 46 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ నుంచి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, వారణాసి నుంచి యూపీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్, సహరాన్ పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ తనయుడు వీరేందర్ రావత్ లకు టికెట్ కేటాయించింది.ఇక వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీపై అజయ్ రాయ్ పోటీ చేయడం ఇది మూడోసారి కానున్నది. శివగంగ నుంచి కార్తీ చిదంబరం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ నుంచి పీఎల్ పూనియా తనయుడు తనుజా పూనియా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పై చౌదరి లాల్ సింగ్, జమ్ము నుంచి జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లా అభ్యర్థిత్వం ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు.వచ్చే నెల 19న తొలిదశ పోలింగ్ జరుగున్నది.