బెంగళూరులో సోమవారం రాత్రిపూట కురిసిన వర్షం విధ్వంసం సృష్టించింది. దాదాపు రెండు వేల ఇండ్లు నీటమునగగా, నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 20వేల వాహనాలు దెబ్బతిన్నాయి. ఒకరు మృతిచెందారు. ఐటీ నగరంలోని ప్రధాన రహదారులన్నింటిపైనా నీళ్లు నిలిచాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఓ నేత వినూత్నంగా తెలిపిన నిరసనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ హరీస్ నలపాడ్ బెంగళూరులో నీళ్లు నిలిచిన రహదారిపై రబ్బరు ట్యూబ్పై తేలుతూ కనిపించాడు. అతడి వెంట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్ణాటక సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ వచ్చారు. బొమ్మై సర్కారు అసమర్థతవల్లే రోడ్లపై నీళ్లు నిలిచి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హరీస్ నలపాడ్ మండిపడ్డాడు. ఇదిలా ఉండగా, బెంగళూరులో ప్రస్తుత పరిస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని సీఎం బొమ్మై ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు ప్రణాళిక లేని పాలనవల్లే అనేక నివాసప్రాంతాలు నీటమునిగిపోతున్నాయన్నారు.
#WATCH | Mohammed Haris Nalapad, President, Karnataka Pradesh Youth Congress Committee floats using an inflated rubber tube on a waterlogged road in #Bengaluru to protest against the state govt demanding a solution to severe waterlogging witnessed in the city pic.twitter.com/IF8DdmNa55
— ANI (@ANI) September 6, 2022