మహబూబాబాద్ : జిల్లాలోని డోర్నకల్ మండల పరిధిలోని రాముతండాలో గురువారం అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం..తండాకు చెందిన భూక్యా చీమా(45) కుమార్తె పెళ్లికి అప్పులు చేశాడు. అవి తీరకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు.
ఈ క్రమంలో మనస్తాపానికి గురై గురువారం తన వ్యవసాయ క్షేత్రం వద్ద వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య భూక్యా లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృదదేహానికి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.