సిటీబ్యూరో, మార్చి 28(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, ఏఆర్ఓలకు పోస్టల్ బ్యాలెట్పై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందించడం, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, నిబంధనలు, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు, తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి తమ ఓటు హకు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒకరు తమ ఓటు హకు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రొనాల్డ్ రాస్ సూచించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఫారం – 12 అందించి, పోస్టల్ బ్యాలెట్పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసే విధంగా ఏర్పాట్లను చేయాలన్నారు.
ఈ జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాలో ఓటు ఉన్న వారికి, ఇతర జిల్లాలో పని చేస్తూ హైదరాబాదు జిల్లాలో ఓటు హకు ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హకు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాజువల్ లీవ్ వెసులుబాటు కల్పించిందన్నారు. నిబంధనల మేరకు ఆయా ప్రక్రియ పూర్తి చేయాలని, ఎన్నికల విధులలో ఉన్న అధికారులు సిబ్బంది అంతా తమ ఓటు హకు వినియోగించుకునేలా చైతన్యపర్చాలని సూచించారు.
అనంతరం హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోరడే, జీహెచ్ఎంసీ ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, ఏఆర్ఓలు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఓటరు తమ ఓటు హకును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్లో టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ లీడర్స్, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు, థర్డ్ జెండర్, ట్రాన్స్ జెండర్స్ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహి ళా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు వేయడం బాధ్యతగా భావించాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. ఇప్పటికే ఓటు హకు పొందిన ప్రతి ఒకరు తమ ఓటు హకును వినియోగించుకోవాలన్నారు.
18 ఏండ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలన్నారు. నమోదు కాని వారు ఏప్రిల్ 15 వరకు నమో దు చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితాలో తమ పేరున్నది, లేనిది చూసుకోవాలన్నారు. ఆయా సంఘాల ప్రతినిధులు ఓటింగ్ శాతం పెంచడంపై కృషి చేయాలని రొనాల్డ్ రాస్ కోరారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఓటు హకు వినియోగించుకునేలా విసృ్తత ప్రచారం చేయాలని చెప్పారు. రెసిడెన్షియల్ అసోసియేషన్ వారితో సమావేశాలు నిర్వహించి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.
స్వయం సహాయక సంఘాలు, విద్యార్థుల ద్వారా వారి కుటుంబంలో ఓటు వేయడంపై అవగాహన కల్పించాలన్నారు. స్వీప్ నోడల్ అధికారి, ఆయా అధికారులు ఎన్నికల్లో సీనియర్ సిటిజన్స్కు, దివ్యాంగ ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరించారు. వారికి సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేలా చర్యలు చేపట్టాలని, ర్యాంప్ సదుపాయం, మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని, వీరికి సెపరేట్ క్యూలైన్/ ప్రాధాన్యతనిచ్చి ఎలాంటి ఇబ్బంది కలగకుం డా నేరుగా తీసుకెళ్ళి ఓటు వేయించాలని, ప్రతి లొకేషన్లో సరిపడినన్ని వీల్ చైర్స్ అందుబాటులో ఉంచాలని రొనాల్డ్ రాస్ తెలిపారు.
85 ఏండ్లు పై బడిన వయో వృద్ధులు, పీడబ్ల్యుడీ ఓటర్లు ఫారం-12డీ కింద దరఖాస్తు చేసుకుంటే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏసీ యూసీడీ చంద్రకాంత్ రెడ్డి, స్వీప్ నోడల్ అధికారి అరుణ కు మారి, జేసీ పీడబ్ల్యూడీ నోడల్ అధికారి వెంకట్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌజ న్య, ఎన్నికల వ్యయ పరిశీలకులు శరత్ చంద్ర, అసిస్టెంట్ స్వీప్ నోడల్ అధికారులు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, దివ్యాంగుల అసోసియేషన్, ట్రాన్స్ జెండర్, థర్డ్ జెండర్ ప్రతినిధులు పాల్గొన్నారు.