నిజామాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైద్యాధికారుల తీరుపై నిజామాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హనుమంతు సీరియసయ్యారు. ప్రభుత్వ వైద్యుల కోడ్ ఉల్లంఘన శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన వార్తపై ఆయన సోమవారం స్పందించారు.
నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సుదర్శనం, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ను ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విభాగం ఉన్నతాధికారులు సైతం లెటర్ పంపినట్టు సమాచారం. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.