Shield 2.0 | హైదరాబాద్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో షీల్డ్ 2.0 (Shield 2.0) కార్యక్రమం నిర్వహించనుంది. సీఎం రేవంత్రెడ్డి నేడు షీల్డ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సైఫర్ స్ప్రింట్లో భాగంగా బాధితులకు రక్షణ, డిజిటల్ రక్షణ భవిష్యత్కు భద్రత అంశాలపై ఈ కార్యక్రమం సాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా టీజీసీఎస్బీ రూపొందించిన సరికొత్త సైబర్ భద్రత సాధనాలను సీఎం ఆవిష్కరించనున్నారు.
సైబర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‘సైఫర్ స్ప్రింట్’ కార్యక్రమంలో భాగంగా ‘బాధితులకు రక్షణ-డిజిటల్ భవిష్యత్కు భద్రత’ అనే నినాదంతో ఈవెంట్నునిర్వహిస్తున్నామని సైబర్సెక్యూరిటీబ్యూరో డీజీపీ శిఖాగోయల్ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలతోపాటు ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని భవిష్యత్లో రాబోయే నేరాల గురించి ఈ సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు.
Cognizant jobs | కాగ్నిజెంట్లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్