హైదరాబాద్ : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదివారం ప్రగతి భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పల్లె, పట్టణ ప్రగతి పురోగతి, అధికారుల పనితీరు, నిధుల వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేపట్టాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై సీఎం సమీక్షించి, పెండింగ్ పనుల పూర్తికి మార్గదర్శనం చేయనున్నారు.