హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన నూతన విమానాశ్రయానికి విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది. గురువారం జరిగిన విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమంలో జగన్మోహన రెడ్డి మాట్లాడుతూ.. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ఈ గడ్డ నుంచే వచ్చారని గుర్తు చేశారు.
ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడంపై టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని అన్నారు.
‘కర్నూలులో ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇది నాకెంతో ఆనందాన్నిచ్చింది. అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడికి దక్కిన అసలైన గౌరవిమిది. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్లో నేను నటించడం, ఆయన పాత్రను నేను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని చిరంజీవి పేర్కొన్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని.. మెగాస్టార్ చిరంజీవి కథా నాయకుడిగా ‘సైరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. కొణిదెల ప్రొడెక్షన్ పతాకంపై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సైరా సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం చిరు..‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా
ఏఎస్ఎఫ్ చార్జీలకు రెక్కలు : గగన విహారం ఇక గగనం..
సామాన్యుడికి వాహన యోగం దూరం : ఏప్రిల్ నుంచి బైక్లు, కార్ల ధరలకు రెక్కలు!
పాన్, ఆధార్ లింక్ చేయించకపోతే రూ.1000 జరిమానా..!