ఎలాన్ మస్క్ ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 24: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికన్ సంస్థ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై టెస్లా కార్లను కొనుగోలు చేయదల్చుకున్నవారు బిట్కాయిన్లను కూడా ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నుంచి అమెరికా వెలుపలి దేశాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని బుధవారం ఆయన ట్వీట్ చేశారు. టెస్లా వాహన కొనుగోలుదారులు చెల్లించే బిట్కాయిన్లను అలాగే ఉంచుతామని, వాటిని సాధారణ కరెన్సీలోకి మార్చబోమని వెల్లడించారు. ఇటీవల 150 కోట్ల డాలర్ల విలువైన బిట్కాయిన్లను కొనుగోలు చేసినట్లు టెస్లా గత నెలలో ప్రకటించింది.