న్యూఢిల్లీ, ఆగస్టు 29: తూర్పు లఢక్లోని దేమ్చోక్ ప్రాంతంలోకి వెళ్తున్న భారత్కు చెందిన కొందరు పశువుల వ్యాపారులను చైనా బలగాలు అడ్డుకున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి ఈ ప్రాంతం సమీపంలో ఉన్నది.
గత వారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి భారత్-చైనా బలగాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరుగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, అరుణాచల్ ప్రదేశ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాలు నిర్మాణాలు చేపడుతున్న విషయం ఇటీవలే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. స్థానికులు వీడియో తీయడం ఈ విషయం వెలుగుచూసింది.