బీజింగ్ : (Explosion @ China) చైనాలోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్లో శుక్రవారం జరిగింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
అల్కా లీగ్లోని బయాన్ ఓబో ఇండస్ట్రియల్ పార్కులోని ఒక రసాయన కర్మాగారం వర్క్షాప్లో రాత్రి 11 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా మంటలు మొత్తం ఫ్యాక్టరీని చుట్టుముట్టాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు శనివారం తెల్లవారుజామున మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ పేలుడు ఎలా జరిగిందో ఇప్పటికిప్పుడు తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రాంతీయ ప్రభుత్వం ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. గాయపడిన వారిని సమీపంలో ఉన్న దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు.
ఇటీవల చైనాలోని షెన్యాంగ్ సిటీలో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 33 మంది గాయపడ్డారు. గ్యాస్ ఎలా లీక్ ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు.
ఫైజాబాద్ రైల్వేస్టేషన్ ఇక అయోధ్య కంటోన్మెంట్!
బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా ఇస్కాన్ ప్రదర్శనలు
యాపిల్ దశ దిశను మార్చిన తొలి ఐపాడ్
జమ్ములో హోం మంత్రి పర్యటన.. అమరుల కుటుంబాలకు పరామర్శ
ఇ-వ్యర్థాల నుంచి బంగారు నాణేలు.. బ్రిటన్ రాయల్ మింట్ చొరవ
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..