రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో రెండు జిల్లాలకు చెందిన 13 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది సుక్మా జిల్లాలో పోలీసుల ఎదుట, మరో ఐదుగురు దంతెవాడలో సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన ఎనిమిది మందిలో వంజమ్ భీమా, అతని భార్య కళావతి ఉన్నారని సుక్మా ఎస్పీ కేఎల్ ధ్రువ్ పేర్కొన్నారు. వంజమ్ భీమాపై రూ.2లక్షల రివార్డు ఉందని చెప్పారు. లొంగిపోయిన వారంతా దళంలో యాక్టివ్ సభ్యులని చెప్పారు. లొంగిపోయిన వారందరికీ రూ.10వేల ప్రోత్సాహకం అందజేశారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసులు చేపడుతున్న ‘లోన్ వర్రాటు’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. ఇప్పటి వరకు 368 మంది నక్సలైట్లు లొంగిపోయాగా.. ఇందులో 96 మంది తలలపై రివార్డులు ఉన్నాయని అధికారులు తెలిపారు.