భద్రాచలం, నవంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శుక్రవారం మరోమారు గంజాయి పట్టుబడింది. ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వర్, భద్రాచలం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం, భద్రాచలం ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా భద్రాచలం పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బ్యాగులతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని తనిఖీ చేయగా.. వారి వద్ద రూ.7 లక్షల విలువైన 58 కిలోల ఎండు గంజాయి లభించింది. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన సురేశ్షిండే, కవిత షిండే, సునీల్పవార్గా గుర్తించారు.