శ్రీరాంపూర్ : హుజురాబాద్ నియోజక వర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిపించాలని కోరుతూ ఆదివారం శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామిల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం శ్రీరామపల్లి గ్రామంలో టీబీజీకేఎస్ నాయకులు ఇంటింటా తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు. ఈ సందర్భగా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ నియోజక వర్గం పరిధిలో 2వేల మంది సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు ఉన్నారని తెలిపారు.
వీరంతా సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. కార్మికులకు కేసీఆర్ అన్ని విధాల హక్కులు కల్పించి సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. హుజురాబాద్ నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్పై నమ్మకంతో గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ భూపాలపల్లి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, ఏరియ చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్, ఫిట్ కార్యదర్శులు రామిడి మహేందర్రెడ్డి, గోపాల్రెడ్డి, నీలం సదయ్య, నాయకులు కొండ రాజయ్య, సిద్దం సందీప్, గొళ్ల సంతోష్ పాల్గొన్నారు.