CAA | వాషింగ్టన్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అమెరికా కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) తెలిపింది. మూడు దేశాలకు చెందిన ఆరు మతాలవారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తున్నదని, ముస్లింలను మినహాయించిందని పేర్కొంది.
ఈ చట్టం వల్ల దేశంలోని 20 కోట్ల మంది మైనారిటీ ముస్లింల హక్కులకు భంగం కలగవచ్చునని తెలిపింది. సీఆర్ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్లో స్వతంత్ర పరిశోధక విభాగం.