హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ): గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం బరాజ్ (సమ్మక సాగర్) కింద ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు అవసరమైన నిధులను జమచేస్తామని, తక్షణమే ఆ బ్యారేజీకి ఎన్వోసీని ఇవ్వాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల కార్యదర్శి రాహుల్బొజ్జా ప్రత్యేకంగా లేఖ రాశారు. ఎస్ఆర్ఎల్ ప్రకారమే ముంపునకు గురయ్యే భూములకే భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం ఇస్తామని, ఆ నిధులను బీజాపూర్ జాయింట్ కలెక్టర్ వద్ద జమచేస్తామని వెల్లడించింది.