వనపర్తి: జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గద్వాల జిల్లా నల్లగుంటకు చెందిన శ్రీవర్ష.. హైదరాబాద్లోని ఓ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నది. కాలేజీకి వెళ్లేందుకు బుధవారం గద్వాల నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.