అలంపూర్, ఏప్రిల్ 23 : అలంపూర్ పట్టణంలో ని జోగుళాంబ, బాలబ్రహేశ్వరస్వామి ఆలయాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకు లు, ఈవో పురేందర్కుమార్, పాలకమండలి కమి టీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు స్వాగతం పలుకగా ఉభయ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం కేటీఆర్కు స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, శేష వస్ర్తాలను ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, నాయకులు చల్లా అగస్త్యరెడ్డి, రఘురెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, తిమ్మాపురం నారాయణ, ఆలయ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి తదితరులున్నారు.