హైదరాబాద్: మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు కదంతొక్కారు. పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేయడం పట్ల నిరసన వ్యక్తంచేశారు. ఉపాధి నిధులతో పంట కల్లాలు నిర్మిస్తే తప్పేంటని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు.
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ తీరును నిరసిస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యే రాములు నాయక్ నేతృత్వంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సూర్యాపేట పట్టణంలో జరిగిన మహాధర్నాలో ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ దీపికా, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజక్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వ విప్ గొగిండి సునిత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో పార్టీ నాయకులు, రైతులు భారీగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన మహాధర్నాలో ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్రనాయక్, భాస్కర్ రావు, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నిజామబాద్ ధర్నాచౌక్లో జరిగిన రైతు మహాధర్నాలో ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్రెడ్డి పాల్గొన్నారు.
మెదక్ జిల్లా మహాధర్నాలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో..
గద్వాలలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్లో..
మహబూబ్నగర్ పట్టణంలో..
వనపర్తి..
ములుగులో..
కరీంనగర్ జిల్లా కేంద్రంలో..
పెద్దపల్లిలో..