యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) నేడు వరంగల్లో( Warangal) పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి నుంచి భువనగిరికి బయలుదేరారు. భువనగిరి మీదుగా వరంగల్ వెళ్తున్నారు. ఐదో రోజు బస్సు యాత్రలో భాగంగా కాసేపట్లో వరంగల్లో రోడ్షోలో పాల్గొంటారు.
కాగా, కేసీఆర్ రైతుల కోసం, రాష్ట్రం కోసం 17రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, 12లోకసభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు(Road show) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతారు. లోకసభ ఎన్నికల్లో(Parliament Elections) పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తారు.