హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): తాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని మహాఅద్భుతమైన మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించినట్టు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మంగళవారం టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో టీడీపీ, కాంగ్రెస్ 58 ప్రభుత్వాలు పాలించిన 58 ఏండ్లలో 17,500 ఓహెచ్ఎస్ఆర్లు నిర్మిస్తే పదేండ్ల తమ ప్రభుత్వంలో 18 వేల ట్యాంకులను నిర్మించినట్టు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఐదేండ్ల తరువాత నల్లగొండ జిల్లాలో కొత్తగా ఫ్లోరైడ్ కేసులు నమోదు కాలేదని, నల్లగొండ ఫ్రీ ఫ్లోరైడ్ జిల్లా అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్లో ప్రకటించిందని గుర్తుచేశారు.
జవాబు: బీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు ఎందుకు నీళ్ల ట్యాంకర్లు ఉండేవి. వీధి నల్లాలు ఉండేటివి, ఆడబిడ్డలు నీళ్లు మోసే వారు అనేది గుర్తు చేసుకోవాలి. తాగునీటి సమస్యను కూడా అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకున్నాం. మహాఅద్భుతమైన పథకాన్ని రూపకల్పన చేశాం. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు 17,500 ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాల కాలంలో 18 వేల ట్యాంకులను నిర్మించాం. వాళ్ల 58 ఏండ్ల పాలన కంటే ఎక్కువగానే మేము ట్యాంకులు నిర్మించాం. మిషన్ భగీరథలో 19 ఇన్టెక్ వెల్ సోర్సులు ఉన్నాయి. గతంలో నదుల నీళ్లు ఇచ్చే వాళ్లు కాదు. ఒక్కో గ్రామంలో 10-20 బోర్లు ఉండేవి. బోర్ల నీటినే ఇచ్చే వారు. ఫ్లోరైడ్ నీళ్లు వచ్చేవి. ఫ్లోరైడ్తో నల్లగొండ జిల్లాలో 1.50 లక్షల మంది నడుములు వంగి పోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ విషంతో నిండుకపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఐదేండ్ల తరువాత నల్లగొండ జిల్లాలో కొత్తగా ఫ్లోరైడ్ కేసులు నమోదు కాలేదని, నల్లగొండ ఫ్రీ ఫ్లోరైడ్ జిల్లా అని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రకటించింది. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్, ఎస్ఆర్ఎస్పీ, దుమ్ముగూడెం, ఎల్లంపల్లి లాంటివి 19 ఇన్టెక్ వెల్ పాయింట్లు ఉంటాయి. 123 వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. సర్వీసు రిజర్వాయర్లు ఉంటాయి. 38 వేల ట్యాంకులు ఉంటాయి. ఏ గ్రామంలో సర్పంచ్లకు, ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. గ్రావీటి ద్వారా ట్యాంకులకు నీళ్లు వెళ్తాయి. నిర్వహణ చార్జీలు ఉండవు. 1.50 లక్షల కిలోమీటర్ల మేర పైపులైన్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి నల్లా నీటిని ఇచ్చాం. 141 మున్సిపాలిటీలకు ఇంటింటికి నీటిని ఇచ్చాం. ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చాం. హైదరాబాద్లో 20 వేల లీటర్ల నీళ్లను ఉచితంగా ఇచ్చాం. మిషన్ భగీరథ గురించి నేను స్వయంగా అసెంబ్లీలో చాలెంజ్ చేశాను.
ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయకుంటే ఓట్లే అడగమని నేను ప్రకటించాను. చెప్పిన ప్రకారం పూర్తి చేశాం. ఆ తరువాత ఏ ఒక్క అడబిడ్డ బిందె పట్టుకొని బయటికి రాలేదు. వీధి నల్లాలు బంద్ పెట్టాం. ట్యాంకర్లు లేవు. ఇంత అద్భుతమైన స్కీంను పట్టుకొని (విండో డిస్మి) పథకం అంటే ఎలా….? వాటిని వాడే తెలివి లేక, గాలికి వదిలేసి, దాని నిర్వహణను పట్టించుకోలేదు. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి 3 వేల మందిని మిషన్ భగీరథకు కేటాయించాం. మళ్లీ ట్యాంకర్లు వచ్చేశాయి. ట్యాంకర్లు రావడానికి మీ అసమర్థత కాదా..? మీ తెలివి తక్కువ తనం కాదా? ఐదు సంవత్సరాలు విజయవంతంగా నడిచిన మిషన్ భగీరథను మీరు ఎందుకు నడిపించలేకపోతున్నారు. ఇది మీ అసమర్థత, మీ తెలివి తక్కువ తనం. దీంట్లో కూడా అవినీతి ఉంది… తోక మట్ట ఉందంటున్నారు. పోలీసు కమాండ్ కంట్రోల్ కట్టినాం, సెక్రటేరియట్ కట్టినాం అందులో కూడా అవినీతినా?!.