మల్కాజిగిరి, నవంబర్ 22: ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మల్కాజిగిరి పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరిలో ద్విచక్రవాహనాల మెకానిక్స్ అసోసియేషన్, బూత్ స్థాయి నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల సమావేశాల్లో ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్లతో కలిని ఆయన పాల్గొన్నారు. అనంతరం అల్వాల్, మల్కాజిగిరి సర్కిళ్ల పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించి.. కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గంలోని మెకానిక్స్, డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం చెల్లించే ఆటో ఫిట్నెస్ చార్జీలను మాఫీ చేస్తామని అన్నారు.
ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు అందచేయాలని అన్నారు. మల్కాజిగిరిలో గెలుపు తథ్యమని అన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, ఆకుల నర్సింగరావు, హుడా మాజీ డైరెక్టర్ వీరేశం యాదవ్, నాయకులు బద్దం పరశురాంరెడ్డి, అమీనుద్దీన్, గౌలికర్ రవీందర్, ఖలీల్ చిన్న యాదవ్, సైయ్యద్ మోసిన్, ప్రభాకర్ , తదితరులు పాల్గొన్నారు.