సిద్దిపేట : ఆయిల్ పామ్ సాగుతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఉద్యాన, ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై సిద్దిపేటలో ఆదివారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుతో రైతాంగానికి అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందన్నారు.
చెరకు, వరి మినహా అన్ని పంటలను ఇందులో అంతర పంటలుగా సాగు చేయొచ్చన్నారు. అంతర పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందొచ్చన్నారు. సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ సాగుకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు. ఆయిల్ పామ్ సాగులో సిద్దిపేటను మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలపాలన్నారు.
అంతకుక్రితం సిద్దిపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. సిద్దిపేట 30వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 8వ వార్డులో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.