ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 14 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాలు భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని చర్లపటేల్గూడ, కప్పాడు, తుర్కగూడ, పోచారం, ఎలిమినేడు, తులేకలాన్, ఉప్పరిగూడ, దండుమైలారంతో పాటు పలు గ్రామాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో జరిగాయి.
మంచాలలో ఊరపోచమ్మ బోనాలు
మంచాలలో ఊర పోచమ్మ బోనాలను ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. బోనాలు ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. మొక్కులు చెల్లించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, ఆటపాటలు ఆకర్షణగా నిలిచాయి.
అమ్మా పోచమ్మతల్లి..
కడ్తాల్ : అన్మాస్పల్లి గ్రామంలో పోచమ్మతల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడపడుచులు పసుపు, కుంకుమ, వేపాకు రకరకాల పూలతో అలంకరించిన బోనాలను అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ పోతుగంటి శంకర్, ఉప సర్పంచ్ అనిల్యాదవ్, టీఆర్ఎస్ మండల, గ్రామాధ్యక్షులు కంబాల పరమేశ్, రావుల రాజాగౌడ్, వార్డు సభ్యులు కుమార్గౌడ్, శ్రీరాములు, గిరి, శ్రీను, రవి, రమేశ్, మైసయ్య, రామకృష్ణ, దేవులానాయక్, జాన్యానాయక్, జంగయ్య పాల్గొన్నారు.
వైభవంగా మల్లన్న బోనాలు
షాబాద్ : షాబాద్ మండలంలోని మల్లారెడ్డిగూడ, సంకెపల్లిగూడ గ్రామాల్లో ఆదివారం మల్లన్న బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గ్రామాల్లోని మల్లన్న దేవాలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలు చిన్నారులు కొత్త బట్టలు ధరించి బోనాలను ఎత్తుకుని మల్లన్నకు బోనాలు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు కుమ్మరి దర్శన్, చందిప్ప జంగయ్య, ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, మాజీ సర్పంచ్ పరిగి గణేశ్గౌడ్, ఉప సర్పంచ్ రాజేందర్రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు ఉన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని లష్కర్గూడ, అనాజ్పూర్, మజీద్పూర్, బాటసింగారం, బండరావిరాల గ్రామాల్లో భోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. పోచమ్మ, ఈదమ్మ, మహంకాళి, మైసమ్మలకు బోనాలు సమర్పించారు. ఆయా గ్రామాల్లోని యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫలహారం బండి, ఘటాలను గ్రామాల పురవీధుల్లో ఊరేగిస్తూ అమ్మవారికి సమర్పించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు పారిజాత, రంగయ్య, పోచంపల్లి సుధాకర్రెడ్డి, ఎర్రవెల్లి లతశ్రీ, కవాడి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు సీక సాయికుమార్గౌడ్, రాచపాక లావణ్య, మేడిపల్లి బాలమ్మ, కేశెట్టి వెంకటేశ్, దంతూరి అనిత, ఉపసర్పంచ్లు యాదయ్యయాదవ్, నార్లకొండ మాధవి, గడ్డం బాలకృష్ణ, కంది భాస్కర్రెడ్డి, స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.