Shilpa Shetty | మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), ఆమె భర్త రాజ్ కుంద్రా (Raj Kundra)కు భారీ ఊరట లభించింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్హౌస్ను ఖాళీ చేయాలంటూ ఈడీ పంపిన నోటీసులపై బాంబే హైకోర్టు (Bombay High Court) స్టే విధించింది.
రాజ్కుంద్రా సంస్థ 2017లో బిట్కాయిన్ల రూపంలో సుమారు రూ.6,600 కోట్లు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు పది శాతం రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ఈ స్కీమ్లో మాస్టర్మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్కుంద్రా సుమారు 285 బిట్కాయిన్లు తీసుకున్నట్లు సమాచారం. ఆ బిట్కాయిన్లతో ఉక్రెయిన్లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
ముంబైలోని జుహూలో శిల్పాశెట్టి పేరుపై ఉన్న ఒక బంగ్లా, పుణెలోని ఒక ఫ్లాట్, కుంద్రా పేరుపై ఉన్న ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.97.79 కోట్లని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గత నెల 27న భవనాలను ఖాళీ చేయాలని ఈడీ నోటీసుల్లో పాల్గొంది. ఈడీ నోటీసులపై శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ నోటీసులపై స్టే విధించింది.
Also Read..
Srinu Vaitla | రవితేజ సూపర్హిట్ వెంకీకి తర్వలో పార్ట్-2.. శ్రీనువైట్ల ఈసారి ఆ హీరోతోనే తీస్తారట
Hurricane Milton | మిల్టన్ తుఫాన్ బీభత్సం.. భయానక వీడియో
Open Fire | బొగ్గు గనిలోని ఉద్యోగులపై సాయుధుడి కాల్పులు.. 20 మంది మృతి