జమ్మికుంట రూరల్ : బక్కపేద ఉద్యమ నాయకున్ని నేను.. మీ బిడ్డగా పని చేస్తా ..కబ్జాదారునికి బుద్ది చెప్పి .. ఆశీర్వదించండి హుజురాబాద్ను అభివృద్ధి చేస్తానని హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొ న్నారు. మండల పరధిలోని బిజిగిరిషరీప్ గ్రామంలో నిర్వహించిన ధూం ధాం కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆభ్యర్ధి మాట్లాడుతూ….పెదరికంలో ఉన్న నన్ను పిలిచి కేసీఆర్ ఆవకాశం ఇచ్చారని చెప్పారు.
బీజేపీ నాయకులు మిడతల దండుల వస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో 100కు పైగా కేసులు పెట్టినా ఉద్యమంలో కేసీఆర్ వెంటే పోరాట చేశానన్నారు. దళితుల, దేవాలయ భూములను కబ్జా చేసిన ఈటల రాజేందర్కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.అభివృద్ది చేయని బిజేపోళ్లను ప్రజలు నమ్మెద్దన్నారు. సీఎం ఆశీస్సులతో డబుల్ బేడ్ రూం ఇండ్లను కట్టి, మొడికల్ కాలేజీ తెస్తానని, నాకొక్క అవకాశమిచ్చి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
అబద్దాల కోర్లు బిజేపోల్లు
బిజేపోల్లు అబద్దాల కోర్లని ,ఏం చేస్తారో చెప్పకుండా ప్రజలను ఓట్లు ఏట్ల అడుగుతారని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జీ ఆరూరి రమేశ్ ధ్వజమెత్తారు. మండల పరిధిలోని బిజిగిరిషరీప్ గ్రామంలో నిర్వహించిన ధూం ధాం కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపోల్లు 100 అబద్ధాలు చెప్పుతున్నారన్నారు.
మీరు ఏం చేస్తారో చెప్పరు. అభివృద్ధి పై మాట్లాడరని అన్నారు. ఈటల రాజేందర్ మోటర్ల కాడ మీటర్లు పెట్టే బీజేపీలో చేరిండు. నిండు మనస్సుతో సీఎం కేసీఆర్ పాలనకు అండగా ఉండాలన్నారు. కారుగుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలన్నారు.