న్యూఢిల్లీ: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సుమారు ౩40 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఇక ఆ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారం కోసం సుమారు 194 కోట్లు ఖర్చు చేసినట్లు ఈసీ తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్కు చెందిన ఎన్నికల ఖర్చు రిపోర్ట్లను ఎన్నికల కమీషన్ రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తమ పార్టీ ప్రచారం కోసం 340 కోట్లు ఖర్చు చేసింది. యూపీలో 221, మణిపూర్లో 23, ఉత్తరాఖండ్లో 43, పంజాబ్లో 36, గోవాలో 19 కోట్లు ఖర్చు చేసింది బీజేపీ. ఈ 5 రాష్ట్రాల్లోనే 194 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస పార్టీ ఈసీకి ఇచ్చిన తన నివేదికలో తెలిపింది.