ఇల్లందకుంట : మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రౌతు భాస్కర్, గుంటి రాజు, రౌతు మొగిలి, రౌతు రాములు మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. ఇక్కడ సర్పంచ్ రఫీఖాన్, ఎంపీటీసీ చిన్నరాయుడు, మాజీ సర్పంచ్ బుర్ర రమేశ్, టీఆర్ఎస్ నాయకులు తారక్, రాజశేఖర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.