హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది. చాలామంది బీజేపీని వదిలి గులాబీ గూటికి చేరుతున్నారు. హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పలువురు బీజేపీ నుంచి గులాబీ పార్టీలో చేరారు. వారికి మంత్రి హరీశ్రావు కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు. అలాగే, వీణవంక మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన 20 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు..గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గడగడపకూ తిరుగుతూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కొత్తగా చేరినవారికి సూచించారు.