Bandi Sanjay | విద్యానగర్, ఏప్రిల్ 27: ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. సమయం, తేదీ, వేదిక మీరే నిర్ణయించండి’ అని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించేదుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు.
శనివారం కరీంనగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మీడియాలో బ్రేకింగ్ల కోసం సవాళ్ల పేరిట నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారని, మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మోసం చేశారని నిప్పులు చెరిగారు. మరో కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ముస్లింల పార్టీ కాంగ్రెస్ అని.. హిందూత్వ టీం బీజేపీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.