లక్నో: నామినేషన్ దాఖలు కోసం బీజేపీ అభ్యర్థి రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్ కేంద్రానికి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని డియోరియా లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శశాంక్ మణి త్రిపాఠి ( Shashank Mani Tripathi) పోటీ చేస్తున్నారు. గురువారం నామినేషన్కు ముందు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనున్నది. దీంతో కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపేంద్ర సింగ్, ఇతర నేతలతో కలిసి శశాంక్ మణి త్రిపాఠి పరుగున నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, నామినేషన్ దాఖలు చేసిన తర్వాత శశాంక్ మణి త్రిపాఠిని మీడియా ప్రశ్నించింది. నామినేషన్ కోసం పరుగులు తీయాల్సినంత ఆలస్యం ఎందుకైందని ఆయనను అడిగింది. నామినేషన్ కేంద్రానికి చేరుకునే ముందు ఒక కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పలువురిని కలవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. కాలేజీ రోజుల్లో తాను రన్నర్ అని, అది ఇప్పుడు ఉపయోగపడిందని చెప్పారు. మరోవైపు నామినేషన్ కేంద్రం వద్దకు ఆయన, ఇతర బీజేపీ నేతలు పరుగులు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Uttar Pradesh: BJP candidate from Deoria, Shashank Mani Tripathi had to run to the nomination centre to file his nomination today as the time to file papers was about to end. pic.twitter.com/2VxJsHqxeQ
— ANI (@ANI) May 9, 2024