వాషింగ్టన్ : కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. చైనాలో మొదట ఉద్భవించిన వైరస్ జంతు వనరు నుంచి ఉద్భవించిందా?.. ప్రయోగాశాల ప్రమాదం నుంచి వచ్చిందా? అనే విషయంపై 90 రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టుకు వచ్చిందని, జంతు వనరు నుంచి సోకిందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. ఈ మేరకు మరోసారి దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తుకు సహకరించాలని అమెరికా నేషనల్ ల్యాబోరేటరీస్కు బైడెన్ విజ్ఞప్తి చేశారు. వైరస్ మూలాలను కనుక్కునేందుకు చైనా సైతం కలిసిరావాలని కోరారు.
పూర్తి పారదర్శక, సాక్ష్య-ఆధారిత, సంబంధిత డేటా, సాక్ష్యాలకు అందించడానికి అంతేకాకుండా చైనాను ఒత్తిడి చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో కలిసి పని చేస్తుందని గుర్తు చేశారు. అంతర్జాతీయ పరిశోధనలకు సహకరించడానికి చైనా ప్రభుత్వం పూర్తిగా నిరాకరించడంతో అసలు నిజాలు ఎప్పటికీ తెలియకపోవచ్చని అన్నారు. కొవిడ్ -19 మూలాలపై దర్యాప్తును ఇప్పటికీ అడ్డుకుంటూనే ఉందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు సమాచార ప్రయత్నాలను రెట్టింపు చేయాలని, విశ్లేషణాత్మక వివరాలను సేకరించాలని సూచించారు. ఖచ్చితమైన నిర్ధారణకు 90 రోజుల్లో తిరిగి నివేదిక ఇవ్వాలని ఇంటిలిజెన్స్ను బైడెన్ ఆదేశించారు. వైరస్తో ఇప్పటికే 3.4 మిలియన్లకుపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు.