కోల్కతా : రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠంలోకి సందర్శకులను ఈ నెల 18 నుంచి అనుమతించనున్నారు. ఈ సందర్భంగా సందర్శకులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పరిపాలన స్పష్టం చేసింది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5.45గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపింది. సందర్శకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, చేతులు శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని సూచించింది.
మఠం ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు థర్మన్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొంది. సందర్శకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, 72 గంటల్లో తీసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ కాపీ, ఆధార్, పాన్, ఓటరు ఐడీ వంటి గుర్తింపు కార్డులను చూపిస్తేనే మఠంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి రెండో దశవ్యాప్తి నేపథ్యంలో మఠాన్ని మూసివేయగా.. ఇటీవల గురు పౌర్ణమి సందర్భంగా జూలై 24న మఠాన్ని ఒక రోజు తెరిచారు.