కరీంనగర్ కార్పొరేషన్/ కరీంనగర్రూరల్ జూలై 11 : కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ పక్రియలో అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి జీవన్రెడ్డి సూచించారు. శనివారం స్థానిక రాజశ్రీ గార్డెన్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఒక ఓటు కూడా పోకుండా బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు. సమస్యలు ఉత్పన్నమైతే ఇన్చార్జిల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ‘సర్’ ప్రక్రియపై పూర్తిస్థాయిలో బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. అనంతరం సర్ కోసం ప్రత్యేకంగా బీఎల్ఏలపై ఇన్చార్జిలను నియమించారు.
బీఆర్ఎస్ బూత్ ఇన్చార్జిల నియామకం
బీఆర్ఎస్ కరీంనగర్ రూరల్ మండల బూత్ ఇన్చార్జిలుగా సుంకిశాల సంపత్రావు, పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, తిప్పర్తి లక్ష్మయ్య, జువ్వాడి రాజేశ్వర్రావు, పబ్బతి రంగారెడ్డిని నియమించారు. వీరికి 2002 ఓటరు లిస్ట్తో పాటు, పార్టీ గుర్తింపు కార్డు, ఇతర సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ ఇన్చార్జి కొండూరు రవీందర్రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, మనోహర్రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.