టేకులపల్లి: మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీలలో పంచాయితీ సిబ్బంది ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం టేకులపల్లి మండలం మేల్లమడుగు గ్రామ పంచాయితీ పరిధిలో సర్పంచ్ మాడె మధు ఆధ్వర్యంలో స్థానిక వైద్య సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలలో భాగంగా ఇంటి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.
ఇళ్ల ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని ప్రజలకు సూచించారు. అలాగే మండలంలో పలు గ్రామాలలో గణేష్ మండపాల వద్ద పంచాయితీ సిబ్బంది ఆధ్వర్యంలో శానిటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధు,పంచాయితీ కార్యదర్శి రాము,స్థానిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.