ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ సెమీస్ రేసులో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్తో కీలక మ్యాచ్కు ముందు ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) స్వదేశానికి పయనమమ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మార్ష్ ఆసీస్కు బయల్దేరాడు. అయితే.. అతను ఎప్పుడు మళ్లీ జట్టుతో కలుస్తాడనేది మాత్రం వెల్లడించలేదు.
‘వ్యక్తిగత కారణాల వల్ల మార్ష్ స్వదేశానికి బయలుదేరాడు. అతడు మళ్లీ జట్టుతో ఎప్పుడు కలుస్తాడు అనేదానిపై ఇప్పుడే ఏం చెప్పలేం’ అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. కంగారూ జట్టు నవంబర్ 4న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో తలపడనుంది.
వరల్డ్ కప్లో వరుసగా రెండు ఓటముల నుంచి తేరుకున్న ఆస్ట్రేలియా వరుసగా శ్రీలంక, నెదర్లాండ్స్, పాకిస్థాన్లను చిత్తుగా ఓడించి.. సెమీస్ రేసులో నిలిచింది. ప్రస్తుతం కమిన్స్ సేన 8 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రాకతో ఆ జట్టు ఓపెనింగ్ సమస్య తీరిపోయింది. అయితే.. ఇంగ్లండ్తో మ్యాచ్కు మార్ష్ దూరం కావడం కమిన్స్ బృందాన్ని ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఆల్రౌండర్ మార్ష్ స్థానంలో ఎవరిని ఆడిస్తారు? అనేది తెలియాల్సి ఉంది.