ODI World Cup 2023 | పంజా వైష్ణవ్తేజ్ ‘ఆదికేశవ’ చిత్రాన్ని మేకర్స్ ఈ నెల 10న విడుదల చేయాలనుకున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే.. ఈ సినిమా విడుదలను ఈ నెల 24వ తేదీకి పోస్ట్పోన్ చేశారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ, చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్.రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. నాగవంశీ మాట్లాడుతూ ‘ వరల్డ్కప్ ఫీవర్ ఎలా ఉందో చూస్తున్నాం కదా.
ఇండియా మ్యాచ్ ఉన్నరోజు సినిమాల వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. పైగా రానున్నవి సెమీ ఫైనల్స్. ఇండియా కప్ గెలుస్తుందనే అంచనాల్లో అందరం ఉన్నాం. అందుకే ఈ టైమ్లో సినిమాను విడుదల చేయడం శ్రేయస్కరం కాదని, పంపిణీదారులతో చర్చించి నవంబర్ 24న ‘ఆదికేశవ’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమా బాగా వచ్చింది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో విడుదల చేయడం సబబుకాదని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు. కుటుంబ ప్రేక్షకులనే కాక, యూత్నీ, ముఖ్యంగా మాస్ని కూడా అలరించే సినిమా ఇదని దర్శకుడు శ్రీకాంత్ చెప్పారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మిసున్నారు.