లిమా : పెరూలో సిహువాస్ ప్రావిన్స్లో బస్సు బోల్తాపడడంతో 20 మంది మృతి చెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. సంఘటన స్థలంలోనే 18 మంది మృతి చెందగా, మరో ఇద్దరు హాస్పిటల్కు తరలిసుండగా మరో ఇద్దరు మృతి చెందారని పరోబాంబ మున్సిపాలిటీ తెలిపింది. పాలోసెకో ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన సాధారణ ఎన్నికల్లో హువాన్చైల్లో ఓటు వేసి పరోబాంబ ప్రాంతాల నుంచి తిరిగి చింబోటే, లిమాకు వెళ్తుండగా ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.