ఆసియా కప్ ఆడుతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాడు రవీంద్ర జడేజా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రాణించిన జడ్డూ.. హాంగ్కాంగ్ మ్యాచ్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అయితే కుడి మోకాలికి గాయం కావడంతో అతను జట్టుకు దూరమయ్యాడని, ఆసియా కప్ ఆడటం లేదని బీసీసీఐ తెలిపింది.
అతని స్థానంలో స్టాండ్బై ఆటగాడు అక్షర్ పటేల్ జట్టుతో కలుస్తాడని వెల్లడించింది. ఇంతకుముందు వెస్టిండీస్తో జరిగిన టీ20 మ్యాచుల్లో అక్షర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ముందు జడ్డూకు ఇలా గాయమవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అతను త్వరగా కోలుకోవాలని, ప్రపంచకప్ ప్రారంభమయ్యేలోపే మళ్లీ ఫామ్ అందుకోవాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.
కాగా, ఆసియా కప్ ప్రారంభానికి ముందే భారత స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ కూడా గాయాలతో ఈ టోర్నీకి దూరమయ్యారు. ప్రపంచకప్లో వాళ్లు కీలకమైన ఆటగాళ్లు. ఇప్పుడు జడ్డూ కూడా గాయంతో జట్టుకు దూరమవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.