Asha Workers | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి ఇప్పటికీ నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై ఆశా కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆశా కార్యకర్తలు తమకు రూ.18 వేల వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదంటూ మరోసారి నిరసన బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
తమతో పని చేయించుకుంటున్నారు కానీ జీతం ఇవ్వడం లేదంటూ ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జీతాలు ఇప్పిస్తానని తమకు హామీ ఇచ్చారని, 3 నెలలు గడిచినా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదంటూ ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు.
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన ఆశా వర్కర్లు
పని చేయించుకుంటున్నారు కానీ జీతం ఇవ్వడం లేదంటూ ఆవేదన
గతంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జీతాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదంటూ ఆశా వర్కర్ల ఆందోళన pic.twitter.com/89XjgZKB8Y
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2026